ఆంధ్రప్రదేశ్లోని అమరావతి మండలంలో ఘర్షన తలెత్తింది. జూపూడి గ్రామంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణను అడ్డుకునేందుకు వెళ్లిన అమరావతి సీఐ శివ ప్రసాద్ కు గాయాలయ్యాయి. నిన్న రాత్రి గ్రామంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో శుక్రవారం కూడా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు మరోసారి రాళ్లు రువ్వుకున్నారు. వారిని అడ్డుకోవడానికి వెళ్లిన సీఐ శివప్రసాద్ తలకు గాయాలయ్యాయి.
అమరావతిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. అడ్డుకోవడానికి వెళ్లిన సీఐకి తీవ్ర గాయాలు
Advertisement
తాజా వార్తలు
Advertisement