Monday, April 29, 2024

KNL: మార్కెట్ వేలంపాట వ‌ద్ద ఘ‌ర్ష‌ణ‌… యువ‌కుడు మృతి

మార్కెట్ వేలంపాట వ‌ద్ద జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో యువ‌కుడు మృతిచెందిన ఘ‌ట‌న‌ నంద్యాల జిల్లా చాగలమర్రిలో చోటుచేసుకుంది. చాగలమర్రి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఇవాళ‌ అధికారులు మార్కెట్ వేలం పాటలు నిర్వహిస్తుండగా ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఇమామ్ అనే యువకుడిని దస్తగిరి అనే వ్యక్తి కత్తితో పొడవడంతో ఇమామ్ తీవ్ర రక్తస్రావమై మృతి చెందాడు.

ఆళ్లగడ్డ రూరల్ సీఐ హనుమంత నాయక్ ఎస్ఐ రమణయ్య సంఘటన స్థలాన్ని సందర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement