Friday, April 26, 2024

‘బస్ డ్రైవింగ్’ యాప్ పేరుతో శ్రీవారి భక్తులకు గాలం

అలిపిరి నుంచి తిరుమలకు ‘బస్ డ్రైవింగ్’ పేరిట గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న గేమ్ యాప్‌ను అధికారులు డిలీట్ చేయించారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్ లోడ్ చేసుకోవాలంటే రూ.179 చెల్లించాలని, ఈ యాప్ లోని గేమ్‌లో విజయం సాధిస్తే 20 శ్రీవారి లడ్డూలు గెలుచుకోవచ్చని యాప్ నిర్వాహకులు నెటిజన్లను ఊరించారు.

ఈ గేమ్‌లో తిరుపతి-తిరుమల బస్సులు కొండపైకి వెళ్లేటప్పుడు రోడ్డు పక్కన ఉండే కొండరాళ్లను ఢీకొన్నట్టు, చెట్లను ఢీకొన్నట్టు చూపించారు. అయితే తిరుమల బస్సులు ఈ విధంగా ప్రమాదాలకు లోనైనట్టు చూపించడం హిందూ ధార్మిక సంఘాలను ఆగ్రహానికి గురిచేసింది. దాంతో వారు ఈ విషయాన్ని టీటీడీ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన టీటీడీ అధికారులు విచారణ చేపట్టగా యాప్ నిర్వాహకుడు సురేష్ పరారయ్యాడు. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు గూగుల్ ప్లే స్టోర్ సిబ్బందికి విషయం వివరించి యాప్‌ను తొలగించేలా చర్యలు తీసుకున్నారు.

ఈ వార్త కూడా చదవండి: నడిరోడ్డుపై సూపర్ లగ్జరీ బస్సు దగ్ధం

Advertisement

తాజా వార్తలు

Advertisement