Saturday, April 20, 2024

నడిరోడ్డుపై ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు దగ్ధం

వ‌రంగ‌ల్ జిల్లా స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో దారుణం జరిగింది. సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సులో షాట్ స‌ర్క్యూట్ కావ‌టంతో జాతీయ ర‌హ‌దారిపై బ‌స్సు ద‌గ్ధ‌మైంది. షార్ట్ స‌ర్క్యూట్‌ను ముందుగా గుర్తించ‌టంతో ప్ర‌యాణికులంతా దిగిపోయారు. అందరూ చూస్తుండ‌గానే బ‌స్సు మంట‌ల్లో ఖాళీ పోయింది.

అయితే ఇటీవల ఆర్టీసీ బస్సుల ఫిట్‌నెస్‌పై ప్రజలకు ఎన్నో అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. అయినా ఆర్టీసీ అధికారుల తీరు మార‌టం లేదు. డ్రైవ‌ర్ల అప్ర‌మ‌త్త‌తో ప్ర‌మాదాల నుండి బ‌య‌ట‌ప‌డుతున్నా రాత్రి వేళ‌ల్లో ఇలాంటి ప్ర‌మాదాలు జ‌రిగి ప్ర‌యాణికుల‌కు ఏమైనా అయితే ఎవ‌రు బాధ్య‌త తీసుకుంటార‌ని ప‌లువురు మండిప‌డుతున్నారు. కాగా రెండు రోజుల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లాలో న‌డిరోడ్డుపై ర‌న్నింగ్‌లో ఉన్న ఆర్టీసీ బ‌స్సు టైర్లు ఊడిపోయిన ఘ‌ట‌న చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

ఈ వార్త కూడా చదవండి: ప్రాణం తీసిన థియేటర్ సీటు

Advertisement

తాజా వార్తలు

Advertisement