Tuesday, May 7, 2024

తిరుమల శ్రీవారి హుండీకే కన్నం..

తిరుమల: శ్రీవారి ఆలయంలోని హుండీ చోరీకి ఓ వ్యక్తి యత్నించాడు. నిందితుడు హుండీలోని రూ.30వేలను చోరీ చేస్తుండగా సీసీ కెమెరాల ద్వారా విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. వెంటనే ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం తిరుమల వన్‌టౌన్‌ పోలీసులకు అప్పగించారు. కేసు న‌మోదు చేసిన‌ పోలీసులు అతడ్ని విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement