Wednesday, May 1, 2024

వైసిపి దాడుల‌పై సోము ఆగ్ర‌హం….

తొట్టంబేడు – ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థికి కాకుండా, బీజేపీ అభ్యర్థికి పని చేశారని వారిపై కక్ష్య పెంచుకుని, శ్రీకాళహస్తి నియోజకవర్గం, పెదకనపర్తి గ్రామంలోని ఒక బలహీన వర్గానికి చెందిన శ్రీదేవి దంపతులు కష్టపడి వేసుకున్న గడ్డి వామును తగులబెట్టిన ఘటనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు ఖండించారు.. పెద్దకనపర్తి గ్రామంలో పర్యటించి , ఘటనాస్థలన్ని పరిశీలించి, బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు.. పార్టీ తరపున పూర్తిగా అండగా ఉంటామని భ‌రోసా ఇచ్చారు, ఇంతటి దారుణానికి పాల్పడ్డ వారి పై చట్టపరమైన చర్యలు తీసుకునేవరకు పూర్తి బాధ్యత పార్టీ తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి కోలా ఆనంద్ , తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు దయాకర్ రెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి కండ్రిగ ఉమ, రేణిగుంట మండల ఇంచార్జ్ మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి తొట్టంబేడు మండల బీజేపీ పార్టీ ప్రధాన నాయకులు,కనపర్తి ప్రసాద్, క్రిష్ణయ్య, మస్తాన్ నాయుడు, గొట్టిపూడి మునిరాజ, పూడి దొరబాబు, చిరంజీవి, రవి ఆచారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement