Tuesday, April 30, 2024

భర్తే కాలయముడు.. హత్య చేసి మృతదేహాన్ని చెరువులో వదిలిన వైనం..

తిరుపతి సిటీ : భార్యను హత్య చేసి సూట్ కేసులో ఉంచి తాళం వేసి చెరువు నీటిలో ప‌డేసిన సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఈస్ట్ సిఐ శివప్రసాద్ రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి… నగరం సత్యనారాయణపురంకు చెందిన సాఫ్ట్ వేర్ వేణుగోపాల్ ఇంజనీర్ తో కొర్లగుంటకు చెందిన పద్మతో వివాహమైంది. గత కొంత కాలంగా భార్య భర్తల మధ్య వివాదం నెలకొనడంతో విడాకుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వేణుగోపాల్ కొన్ని నెలల క్రితమే భార్యను హత్య చేసి ఆపై మృతదేహాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయడంతో అనుమానం వచ్చి అల్లుడిని తన కూతురు జాడ చెప్పమని అడిగినా స్పందించకపోవడంతో ఈనెల 27వ తేదీన పద్మ తల్లి మల్లిక ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై వేణుగోపాల్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు తనదైన శైలిలో విచారించడంతో హ‌త్య ఘ‌ట‌న‌ వెలుగులోకి వచ్చింది. హ‌త్య‌ చేసిన వేణుగోపాల్ ను తీసుకుని మృతదేహం దాచిన‌ ప్రాంతానికి తీసుకుని వెళ్లి గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. మిస్సింగ్ కేసును హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement