Wednesday, May 1, 2024

స్వర్ణరథంపై పద్మావతి అమ్మవారి సాక్షాత్కారం

తిరుపతి : తిరుచానూరు పద్మావతి అమ్మవారి వసంతోత్సవాల్లో భాగంగా రెండవరోజు శుక్రవారం స్వర్ణరథం పై ఆశీనులై భక్తులను సాక్షాత్కరించారు. ఆలయంలో ఉదయం వైదిక కార్యక్రమాల అనంతరం శ్రీపద్మావతి అమ్మవారి ఉత్సవ మూర్తిని అర్చకులు స్వర్ణరథంపై ఆశీనురాలిని చేశారు. భక్తులు తన్మయత్వంతో నాలుగుమాడ వీధుల్లో రథాన్ని లాగారు. కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ ఈవో గోవింద రాజన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement