Thursday, May 2, 2024

పుంగనూరు నియోజకవర్గంలో నారా లోకేష్‌ పాద‌యాత్ర‌..

టీడీపీ యువనేత నారా లోకేష్ చేప‌ట్టిన‌ యువగళం పాదయాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. పుంగనూరు నియోజకవర్గంలో నేడు లోకేష్ పాద‌యాత్ర కొన‌సాగ‌నుంది. శుక్ర‌వారం పాద‌యాత్రకు సంబందించిన షెడ్యూల్ ఇలా ఉంది. ఉద‌యం 10.00 గంట‌ల‌కు కొమ్మురెడ్డిపల్లి (పులిచర్ల మండలం) విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. 11.00 గంట‌ల‌కు కొత్తపేట బహిరంగ సభలో యువనేత నారా లోకేష్ ప్రసంగం చేయ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 1.00 గంట‌ల‌కు ఎగువ బెస్తపల్లిలో బెస్త సామాజిక వర్గీయులతో సమావేశం కానున్నారు. 1.45కు మంగళంపేట మెయిన్ సెంటర్ లో స్థానికులతో మాటామంతీ, 2.20కి బలిజపల్లిలో భోజన విరామం తీసుకోనున్నారు. సాయంత్రం 3.30కి బలిజపల్లినుంచి పాదయాత్ర కొనసాగింపు, 5.30కి మొప్పిరెడ్డిగారిపల్లిలో స్థానికులతో భేటీ కానున్నారు. 6.35కి పులిచర్లలో ఎస్సీ సామాజికవర్గీయులతో ముఖాముఖి అవ్వ‌నున్నారు. 7.40 – కొక్కువారిపల్లి విడిది కేంద్రంలో బస చేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement