Friday, May 17, 2024

ఉద్యోగాలకు ఎంపికైన మిట్స్ విద్యార్థులు..

కురబలకోట – అంగళ్ళు సమీపంలో గల మిట్స్ కళాశాల నందు ఏం.బి.ఏ విద్యార్థులకు నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో 14 మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. శనివారం మిట్స్ కళాశాలలో బెంగళూరు కు చెందిన పేటిఎమ్ వారు నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో 14 మంది విద్యార్థులు కు ఉద్యోగాలు లభించినట్లు తెలిపారు. వీరికి సంవత్సరానికి 4 లక్షల 40 వేల వేతనం అన్నారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ యువరాజ్, డీన్ ఐఐఐసీ డాక్టర్. రాంప్రసాద్ రావు, ప్లేసెమెంట్ ఆఫీసర్ రవి కుమార్ తదితరులు అభినందనలు తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement