Monday, April 29, 2024

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మంత్రి హరీశ్ రావు

తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు తిరుమలలో పర్యటిస్తున్నారు. ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా స్వామి వారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న రాత్రి కాలినడకన తిరుమల‌ చేరుకున్న హ‌రీశ్‌రావుకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈరోజు ఉదయం ఆయన వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో మంత్రి హరీష్ రావుకు వేదపండితులు ఆశీర్వచనం అందించగా, టీటీడీ ఆలయ అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement