Monday, April 29, 2024

ర‌త్న‌ప్ర‌భ నామినేష‌న్ తిర‌స్క‌రించండి – రిట‌ర్నింగ్ అధికారికి జ‌న‌తాద‌ళ్ ఫిర్యాదు..

నెల్లూరు: తిరుపతి ఉప ఎన్నికల్లో‌ బీజేపీ అభ్యర్థి ర‌త్న‌ప్ర‌భ నామినేష‌న్ ను తిర‌స్క‌రించాల‌ని కోరుతూ జ‌న‌తాదళ్ యు కి చెందిన నేత ఎవి ర‌మ‌ణ రిట‌ర్నింగ్ అధికారికి లిఖిత పూర్వ‌కంగా లేఖ అందించారు.. నామినేష‌న్ ప‌త్రాల‌లో ర‌త్న ప్ర‌భ త‌న‌పై ఎటువంటి కేసులు లేవ‌ని పేర్కొన్నార‌ని, అయితే హైద‌రాబాద్ లోని బంజారాహిల్స్, సైఫాబాద్, హనుమంతుపాడు పోలీస్‌స్టేషన్లలో ఆమెపై అయిదు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొ న్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను అధికారికి సమర్పించారు. కుల ధృవీకరణ పత్రాలకి రికార్డులు లేవని, స్కిల్ డెవలెప్ మెంట్ ఛైర్మన్‌గా పనిచేస్తూ, పెన్షన్‌పై జీవిస్తున్నట్టు తెలిపారని ఆరోపించారు. ఇవ‌న్ని అవాస్త‌వాల‌ను అంటూ వెంట‌నే రికార్డులు ప‌రిశీలించి ఆమె నామినేష‌న్ తిర‌స్క‌రించాల‌ని ర‌మ‌ణ ఆర్వోని కోరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement