Friday, May 3, 2024

రంగ రంగ వైభవంగా సినిమాను ఆదరించండి.. వైష్ణవ్ తేజ్

తిరుపతి సిటీ : రంగరంగ వైభవంగా సినిమా చూసి ఆదరించాలని హీరో వైష్ణవ్ తేజ్ పిలుపునిచ్చారు. ఈరోజు ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో వైష్ణవి తేజ్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 2న ఈ సినిమా విడుదల కానున్నదని. అందరినీ ఆకట్టుకునే విధంగా తీయడం జరిగిందని.. ఈ సినిమా చూసి ఆదరించాలని కోరారు. ఈ సినిమా బాగా దిగ్విజయం కావాలని శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నామ‌న్నారు. బాల్యానికి సంబంధించిన సన్నివేశంతో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగిందన్నారు. చిన్నప్పటి నుంచి గొడవ పడుతుండే ఇద్దరు వ్యక్తులు ప్రేమికులుగా ఎలా మారారు. చివరికి ఒకటయ్యారా లేదా అనే కథాంశంతో ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రంలోని సన్నివేశాలు చూస్తే అర్థమవుతుందన్నారు. కుటుంబ సమేతంగా అందరూ ఈ సినిమాను చూసి ఆదరించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement