Saturday, April 27, 2024

విద్యుత్ షాక్.. మంట‌ల్లో లారీ.. డ్రైవర్ మృతి

రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ వైర్లు తాక‌డంతో ఓ లారీ ద‌గ్థమ‌యింది. మంట‌ల్లోంచి త‌ప్పించుకునే క్ర‌మంలో లారీ డ్రైవ‌ర్ కిందకి దూకే స‌మ‌యంలో విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. ఈ సంఘ‌ట‌న కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం వెంకటాపురం వద్ద చోటు చేసుకుంది. కోడిగుడ్ల తరలిస్తున్న ఈచర్ వాహనానికి విద్యుత్ తగిలి వాహనం పూర్తిగా దగ్ధమైంది..కాగా మృతుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కు చెందిన ఫయాజ్ గా గుర్తించారు.వాహనం గుజరాత్ రాష్ట్రానికి చెందినదని పోలీసులు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement