Monday, March 25, 2024

2nd Match: కోల్‌క‌తా టార్గెట్ 192 పరుగులు

మొహాలీలో పంజాబ్ కింగ్స్ వ‌ర్సెస్ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో మొద‌ట బ్యాటింగ్ చేప‌ట్టిన పంజాబ్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి పరుగులు 191 చేసింది. దీంతో కోల్‌క‌తా నైట్ రైడర్స్ విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే పరుగులు 192 చేయాల్సి ఉంది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ బ్యాట్స్ మెన్లు భానుక రాజపక్స 50 పరుగులు, కెప్టెన్ శిఖర్ ధావన్ 40 పరుగులు, ప్రభ్ సిమ్రన్ సింగ్ 23 పరుగులు, జితేశ్ శర్మ 21 పరుగులు చేశారు. కోల్ కతా బౌలర్లు టిమ్ సౌథీ రెండు వికెట్లు తీయగా, ఉమేష్ యాదవ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తిలు ఒక్కొక్కటి చొప్పున వికెట్లు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement