Friday, May 3, 2024

త్వరలోనే తిరుమల ఘాట్‌రోడ్డులో ఎలక్ట్రిక్‌ బస్సులు..

తిరుమల, ప్రభన్యూస్‌ : త్వరలోనే తిరుమల ఘాట్‌రోడ్డులలో ఎలక్ట్రిక్‌ బస్సులు నడుపుతామని |ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమరావు తెలిపారు. శుక్రవారం ఉదయం విఐపి విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడుతూ, మొదటి దశలో సెప్టెంబర్‌ చివరికి 20 బస్సులను నడుపుతామని, డిసెంబర్‌ ఆఖరు లోపల తిరుమలతో పాటు తిరుపతి కేంద్రంగా వివిధ ప్రాంతాలకు 100 బస్సులు నడిపే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, ఒక్కసారి బ్యాటరి చార్జ్‌ చేస్తే 250 కిలోమీటర్ల మేర బస్సు నడుస్తుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement