Friday, April 26, 2024

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకునేందుకు తిరుమ‌ల‌కు వివిధ ప్రాంతాల నుంచి త‌ర‌లివ‌చ్చారు. గురువారం భ‌క్తుల ర‌ద్దీ సాధార‌ణంగా ఉంద‌ని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. భక్తులు కొండపై ఉన్న కంపార్ట్‌మెంట్లలో నాలుగు కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. నిన్న స్వామివారిని 62,101 మంది భక్తులు దర్శించుకోగా 25,836 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లు వచ్చిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement