Saturday, May 4, 2024

తిరుమ‌ల‌లో పెరిగిన భక్తుల రద్దీ..

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తుల ర‌ద్దీ నెల‌కొంది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 29 కంపార్టుమెంట్లో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న (బుధవారం) శ్రీవారిని 74,995 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.60 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 38,663 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement