Thursday, May 2, 2024

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ..

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారి ద‌ర్శ‌నానికి భ‌క్తులు పోటెత్తారు. భ‌క్తుల ర‌ద్దీ పెర‌గ‌డంతో టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్ప‌టికే శ్రీవారి సర్వదర్శనానికి 19 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉండ‌గా.. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం క‌లుగుతుంద‌ని ఆల‌య అధికారులు తెలిపారు. నిన్న 71,299 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 28,288 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.26 కోట్లు వచ్చిందని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement