Sunday, April 28, 2024

అన్న‌మ‌య్య జిల్లాలో దారుణ హ‌త్య‌.. తల నరికి తీసుకెళ్లిన దుండ‌గులు..

అన్నమయ్య జిల్లా మదన పల్లెలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఓ వ్య‌క్తిని హ‌త్య చేసి.. తల నరికి తీసికెళ్ళిన ఘటన మదనపల్లి పట్టణంలో కలకలంరేపింది. బెంగళూరు రోడ్డులోని తాళి రెడ్డి ఫ్యాక్టరీ వద్ద కొంతమంది వ్యక్తులు సోమవారం రాత్రి ఓ వ్యక్తిని అతి కిరాత‌కంగా నరికి చంపి తలను తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం స్థానికుల గుర్తించి పోలీసుల‌కు సమాచారం అందించారు. వెంట‌నే హుటాహుటిన ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని ప‌రిశీలించారు. అరంత‌రం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఇంకా పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement