Sunday, May 19, 2024

చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో మగశిశువు కిడ్నాప్

ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో మగశిశువును కిడ్నాప్ చేశారు. చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో బాలుడును గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. షబానా అనే మహిళ ఈనెల 14వతేదీన మగశిశువుకు జన్మనిచ్చింది. అయితే కిడ్నాపర్ ఈరోజు తెల్లవారుజామున బాలుడిని కిడ్నాప్ చేసినట్లు సమాచారం. కిడ్నాపర్ ను పోలీసులు సీసీ పుటేజీలో గుర్తించారు. శిశువును 40ఏళ్ల మహిళ ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. నిందితురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పసికందు కిడ్నాప్ పై జేసీ శ్రీధర్ స్పందించారు. విచారణ వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement