Sunday, May 5, 2024

హాస్ట‌ల్స్ పై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడులు

తిరుపతి సిటీ : హాస్టల్స్ పై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఈరోజు దాడులు నిర్వహించడం జరిగిందని తిరుపతి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి ఈశ్వర్ రెడ్డి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ ఆదేశాల మేరకు దాడులు చేయడం జరిగిందని వివరించారు.

రెండు జిల్లాల‌ వ్యాప్తంగా నాలుగు బృందాలుగా విడిపోయి తిరుపతి, చిత్తూరు జిల్లాలోని వివిధ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల‌లో అక‌స్మాత్తుగా తనిఖీలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు. విద్యార్థుల వసతి సౌకర్యాల నిర్వహణ, నిధుల వినియోగం, ఆరోగ్యం, ఆహార విషయాలపై ఆరా తీయడం జరిగిందన్నారు. ఇక నుంచి ఈ దాడులు నిరంతరం కొనసాగుతూ ఉంటాయన్నారు. నిర్లక్ష్యం చేసేటువంటి అధికారులపై సంబంధిత అధికారులకు నివేదిక పంపనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement