Thursday, April 25, 2024

మాజీ ప్రియుడితో కలిసి యువతి ఆత్మహత్య

తిరుపతి సిటీ : మాజీ ప్రియుడితో కలిసి ఉరివేసుకుని యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలో ఓ లాడ్జిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదుకు చెందిన కృష్ణారావు (20). ఈస్ట్ గోదావరి కొవ్వూరు టౌన్ కు చెందిన వెంకటేశ్వరరావు కుమార్తె అనూష (20) . గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరిది వేర్వేరు కులం కావడంతో పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో అనూష తల్లిదండ్రులు రెండు సంవత్సరాల క్రితం ఆమెకి వివాహం చేశారు. ఈనెల మూడో తేదీన అనూష ఇంటి నుంచి వచ్చేసింది. దీంతో వారి తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు కింద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కోవూరులో ఈనెల 5వ తేదీన తప్పిపోయినట్లు కేసు నమోదు చేశారు.

తిరుపతి నగరానికి ఆదివారం ఉదయం వచ్చి గోవిందరాజు స్వామి గుడి పక్కన లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ.. ఇద్దరు కలిసి ఒకే ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. లాడ్జి రూమ్ బాయ్స్ గదిని బెల్ కొట్టినా తీయలేదు. దీంతో అనుమానం వచ్చి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈస్ట్ సిఐ శివ ప్రసాద్ రెడ్డి, ఎస్ఐ నాగేంద్రబాబు, బ్లూ కోర్స్ సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా.. రూమ్ లో ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. వారి దగ్గర ఉన్న ఆధారాల నిమిత్తం తల్లిదండ్రులకు సమాచారం అందించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ శివప్రసాద్ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement