Tuesday, May 14, 2024

కుక్కల దాడిలో 17 గొర్రెలు మృతి

పెద్దమండ్యం : గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో 17 గొర్రెలు మృతి చెందిన సంఘటన మంగళవారం కలిచెర్లలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కలిచెర్ల సాకల బజారులో నివాసముంటున్న శ్రీనివాసులు , శ్రీరాములు ప్రతి రోజు మాదిరిగా గొర్రెలు మేపుకొని తమ ఇంట్టిదగ్గర దొడ్డలో గొర్రెలను తోలినారు. అయితే వీధి కుక్కలు గొర్రెలు దొడ్డిలో పడి గొర్రెలపై దాడి చేశాయి.. దీంతో 17 గర్రెలు మృతి చెందాయి. ఈ విషయము గమనించిన రైతులు వెంటనే కుక్కలు తరిమి వేచినారు. ఈ విషయము పశువైద్యాధికారి విక్రమ్ రెడ్డి కి సమాచారం ఇవ్వడంతో వెంటనే సంఘటిత స్థలాన్ని చెరుకొని మృతి చెందిన గొర్రెలకు పంచనామా చేసి నష్ట పరిహారం క్రింద ఒక్కో గొర్రెకు 6000 రూపాయల చెలించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement