Wednesday, May 1, 2024

గోదావరిఖనిలో బస్సులో మంటలు.. తప్పిన ప్రమాదం

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోని గోదావరి ఖని వద్ద బస్సులో మంటలు చెలరేగాయి. పార్కింగ్ చేసిన ప్రైవేట్ బస్సులో నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదంపై స్థానికులు ఎండివేడిమితోనే మంటలు వ్యాపించాయంటున్నారు.. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. గోదావరి ఖనిలో నాలుగైదు రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఈ బస్సులో ఎవరు లేనప్పుడు మంటలు చెలరేగడంతో పెనుప్రమాదం తప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement