Monday, April 29, 2024

ఫిష్, మటన్, చికెన్ దుకాణాలపై 14 కేసులు నమోదు

తిరుపతి సిటీ : నగరంలో లీలా మహల్ శ్రీనివాసపురం దగ్గర ఫిష్ మార్కెట్, మటన్, చికెన్, దుకాణాల‌పై ఆదివారం విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజి ఆదేశాల మేరకు దుకాణాలలో తక్కువ తూకాలతో చేపలు, మాంసం విక్రయిస్తున్న వ్యాపారులపై దాడులు నిర్వహించారు. తిరుపతి విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం రీజినల్ అధికారి కే.ఈశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో మూడు టీంలుగా ఏర్పడి తిరుపతి చిత్తూరు జిల్లాల యందు లీగల్ మెట్రాలజీ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. వ్యాపారులపై 14 లీగల్ మెట్రాలజీ కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి రీజినల్ విజిలెన్స్ అండ్ ఇన్ ఫోర్స్ మెంట్ అధికారి కె.ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ఎవరైనా వ్యాపారస్తులు తక్కువ తూకంతో వినియోగదారులను మోసం చేస్తే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ అండ్ ఇన్ ఫోర్స్మెంట్ సీఐలు, లీగల్ మెట్రాలజీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement