Saturday, May 4, 2024

ఏర్పేడులో 10 మంది వలస కూలీలకు అస్వస్థత

తిరుపతి : ఏర్పేడులో 10 మంది జార్ఖండ్‌, బీహార్‌కు చెందిన వలస కూలీలు అస్వస్థతకు గురయ్యారు. వీరంతా జంగాలపల్లిలోని డీఈసీ కంపెనీలో పనిచేస్తున్నారు. కూలీలంతా వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరారు. అయితే పైప్‌లైన్‌లో మురుగు నీరు కలవడంతోనే అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. తాగునీరు కలుషితం అయినట్లు తెలుస్తోంది. దీంతో వైద్య శాఖ అధికారులు పరిసరాలను పరిశీలించారు. జంగాలపల్లిలో మెడికల్‌ క్యాంపును ఏర్పాటు చేశారు. అధికారులు కూలీలకు మరోచోట వసతి కల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement