Saturday, May 18, 2024

తిరుమ‌ల‌లో 18వ తేది నుంచి సుందరకాండ అఖండ పారాయణం

తిరుమల : కరోనా మహమ్మారి నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఈ నెల 18న 11వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయణం జ‌రుగ‌నుంది. ఆ రోజు ఉద‌యం 7 గంటల నుంచి సుందరకాండలోని 45వ సర్గ నుంచి 48వ సర్గ వరకు ఉన్న 156 శ్లోకాలను పారాయణం చేయనున్నారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుప‌తిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయ‌ణంలో పాల్గొనున్నారు. కాగా, ఇప్పటి వరకు టీటీడీ పది అఖండ పారాయ‌ణాలను విజయవంతంగా నిర్వహించింది. ఇక ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్‌ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement