Sunday, April 28, 2024

Breaking: ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణిపై అరెస్ట్ వారెంట్ జారీ

 వైసీపీ ఎమ్మెల్యే రోజా భర్త, ప్రముఖ దర్శకుడు సెల్వమణిపై చెన్నై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అలాగే కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ అన్బరసు కుమారుడు అరుళ్‌ అన్బరసుపై కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2017లో సౌకార్‌పేటకు చెందిన ఫిలిం ఫైనాన్షియర్ ముఖంచంద్ బోత్రా దాఖలు చేసిన పరువునష్టం కేసుకు సంబంధించి ఈ వారెంట్లు జారీ అయ్యాయి.

గతంలో సెల్వమణి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుళ్ అన్బరసు ఓ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. ఫైనాన్షియర్ ముకుంద్‌ చంద్ బోద్రాపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో వీరిద్దరిపై బోద్రా జార్జిటౌన్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. అయితే, ఆ తర్వాత ఆయన మరణించారు. దీంతో ఆయన కుమారుడు గగన్ బోద్రా ఈ కేసు తరుపున పోరాడుతున్నారు. ఈ క్రమంలో నిన్న ఈ కేసు విచారణకు వచ్చింది. సెల్వమణి, అరుళ్ అన్బరసులు విచారణకు హాజరు కాలేదు. అంతేకాదు, వారి తరపు న్యాయవాదులు కూడా హాజరు కాలేదు. దీంతో వారిద్దరిపై బెయిలబుల్‌ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement