Thursday, April 25, 2024

సినీ పక్కీ లో చేజింగ్‌.. ముగ్గురు ఎర్ర స్మగ్లర్ల అరెస్ట్

కలికిరి, (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : పారిపోబోయిన ఎర్ర చందనం స్మగ్లర్లను పోలీసులు సినిమా పక్కీలో వెంటాడి పట్టుకున్న ఘటన ఇవ్వాల (శ‌నివారం) అన్నమయ్య జిల్లా కలికిరివద్ద జరిగింది. మండలంలోని మేడికుర్తి – కలకడ క్రాస్ దగ్గర కలికిరి ఎస్ఐ లోకేష్ రెడ్డి తమ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ద్విచక్రవాహనంపై ఇద్దరు వ్యక్తులు వేగంగా వస్తూ కనిపించారు. వారిని అపడానికి యత్నించగా త‌ప్పించుకుని పారిపోయారు. వారి వెనక‌నే వచ్చిన మరో కారు కూడా అలాగే దూసుకెళ్ళింది. దీంతో అనుమానం వ‌చ్చిన‌ పోలీసులు వారిని వెంబడించారు. ఒక చోట వాహనాలు వదిలి పారిపోయే క్రమంలో పోలీసులు పట్టుకున్నారు.

ఈ సందర్బంగా రూ ఏడు లక్షల విలువైన వాహనాలను, ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అదుపులోకి తీసుకొన్నట్టు ఎస్ ఐ లోకేష్ రెడ్డి తెలిపారు. ఆ ముగ్గురు తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు మనీ బాబు, కుల్లాన్ కుమార్, పొన్నుస్వామిగా గుర్తించామని చెప్పారు. కేసునమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఇంకా పారిపోయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఏ ఎస్ ఐ లు మధుసూదనాచారి, మాబు సాబ్, హెడ్ కానిస్టేబుళ్ళు .మనోహర్, రాజేంద్ర, రఫీ, కానిస్టేబుళ్లు చైతన్య, అమరనాథ్, జిలానీ, వెంకటసిద్దులు, సుబ్రమణ్యం, హోం గార్ద్లు రఫీ, నిజాముద్దీన్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement