Saturday, May 4, 2024

Chandrababu: ఇవాళ తుని, బొబ్బిలిలో బాబు ప‌ర్య‌ట‌న‌..

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ తుని, బొబ్బిలిలో పర్యటించనున్నారు. టీడీపీ నిర్వహిస్తున్న రా కదలిరా సభల్లో పాల్గొంటారు. ఉదయం బొబ్బిలిలో జరిగే సభలో పాల్గొంటారు. ఈ మేరకు అధినేత పర్యటనకు జిల్లా టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.

తుని జాతీయ రహదారి సమీపంలో చామవరం వద్ద నిర్వహిస్తున్న సభకు యాభైవేల మందికి పైగా పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. కాగా చంద్రబాబు సభకు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి వేలాది మందితో ఇంచార్జులు, మాజీ ఎమ్మెల్యేలు తరలి రానున్నారు. వీరందరికి సభా ప్రాంగణంలో ప్రత్యేక పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం తునిలో జరిగే సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement