Thursday, May 2, 2024

Ayodhya: ఇవాళ రాములోరి విగ్రహ ప్రతిష్టకు చంద్ర‌బాబు, ప‌వ‌న్‌

ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అయోధ్యకు వెళుతున్నారు. రామజన్మభూమి అయోధ్యలో రాములోరి విగ్రహ ప్రతిష్టకు వీరిరువురూ హాజరు కానున్నారు. ఇప్పటికే వీరిద్దరికీ ఆహ్వానం రావడంతో వీరిద్దరూ బయలుదేరి అయోధ్యకు చేరుకోనున్నారు.

రాత్రికి అక్కడే బస చేసి.. సోమవారం రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టకు హాజరవుతారు. ఈ క్రమంలో ఈనెల 25న కర్నూలు జిల్లా పత్తికొండలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘రా కదలిరా’ కార్యక్రమం వాయిదా పడింది. 22వ తేదీన అయోధ్యలో జరిగే రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి చంద్రబాబు వెళ్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం వాయిదా పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement