Thursday, May 2, 2024

బాబాయ్ హత్యతో జగన్ పతనం.. నిందితుడిగా తేలుతున్నారన్న చంద్రబాబు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగనే నిందితుడని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఈ కేసులో ఏ వాంగ్మూలాన్ని చూసినా సీఎం జగనే నిందితుడిగా తేలుతున్నారని అన్నారు. ఈ హత్య కేసులో జగన్ పూర్తిగా కూరుకుపోయారని చెప్పారు. వివేకా హత్య కేసును తనపై నెట్టాలని ప్రయత్నించారని మండిపడ్డారు. బాబాయ్ హత్య ఘటనతో జగన్ అన్ని విధాలుగా పతనమయ్యారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చేస్తే ఏమవుతుంది? అని ప్రశ్నించారు. ఇప్పటికే 11 కేసులు ఉన్నాయి, ఇది 12వ కేసు అవుతుంది అని జగన్ అనడం దారుణమన్నారు. చట్టం అంటే లెక్కలేనితనాన్ని ఇది సూచిస్తోందని పేర్కొన్నారు. వివేకా హత్యలో ప్రధాన సూత్రధారి ఎవరనే విషయం అందరికీ అర్థమయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైయస్ రాజశేఖరరెడ్డి కోటలోనే ఆయన సోదరుడిని హత్య చేశారన్న చంద్రబాబు… పెద్దల ప్రోత్సాహం లేకుండా హత్య ఎలా సాధ్యమని ప్రశ్నించారు. వివేకా హత్యను రాజకీయంగా వాడుకున్న సీఎం జగన్ ఇప్పుడు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement