Friday, May 17, 2024

చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ రద్దు – సాయంత్రం లోకేష్ మీడియా సమావేశం

రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న నారా చంద్రబాబునాయుడుతో కుటుంబ సభ్యుల ములాఖత్ రద్దయింది. తొలుత ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, నారా భువనేశ్వరి, బ్రాహ్మణి టీడీపీ అధినేతను కలుస్తారని భావించారు. ఈ మేరకు జైలు అధికారులకు కూడా సమాచారం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా నారా లోకేశ్ తన బస్సులో ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. అరెస్ట్ తర్వాత పరిణామాలపై ఆయన నేతలతో చర్చిస్తున్నారు. ఇక సాయంత్రం ఆరు గంటలకు నారా లోకేష్ మీడియాతో మాట్లాడనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement