Tuesday, April 30, 2024

NZB: సమాచార కేంద్రం నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా మాయావర్ రాజేశ్వర్

నిజామాబాద్ సిటీ, సెప్టెంబర్ 11(ప్రభ న్యూస్): రాష్ట్ర వినియోగదారుల సమాచార కేంద్రం నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా మాయావర్ రాజేశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్ లోని ఆబిడ్స్ లోగల రాఘవరత్న టవర్స్ ఆల్ ఇండియా మైనింగ్ ఇంజనీర్స్ అసోసియేషన్ మీటింగ్ హాల్ లో జరిగిన సమావేశంలో రాష్ట్ర వినియోగదారుల సమాచార కేంద్ర నూతన కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

రాష్ట్ర అధ్యక్షులుగా నిజామాబాద్ జిల్లాకు చెందిన మాయవార్ రాజేశ్వర్, రాష్ట్ర ఉపాధ్య క్షులుగా హనుమకొండ జిల్లాకు చెందిన ప్రొఫెసర్ రతన్ సింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన వింజమూరి సుధాకర్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా మహబూబ్ నగర్ కు చెందిన బాల లింగయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా సూర్యపేటకు చెందిన పిల్లలమర్రి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కోశాధికారిగా నల్గొండ జిల్లాకు చెందిన చింతమళ్ళ గురువయ్య, రాష్ట్ర రీజినల్ సెక్రటరీగా వరంగల్ జిల్లాకు చెందిన గిరగాని సుదర్శన్ గౌడ్, కార్యవర్గ సభ్యులుగా మెదక్ జిల్లా నుండి వెంకటేశ్, రంగారెడ్డి జిల్లా నుండి దీక్షితులు, మేడ్చల్ నుండి చిక్కిల్లి మధుబాబు, కామారెడ్డి నుండి బి.సువర్ణ, భద్రాద్రి కొత్తగూడెం నుండి తిరుపతయ్య, ఖమ్మం నుండి రామకృష్ణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement