Sunday, April 28, 2024

Flash: పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్ర మరో మెలిక

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రం మరో మెలిక పెట్టింది. సామాజిక, ఆర్థిక సర్వే మరోసారి నిర్వహించాలని కేంద్రం షరతులు విధించింది. డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌పై డీపీఆర్‌ తయారు చేయాల్సిందేనని నిబంధన పెట్టింది. ఈమేరకు లోక్‌సభలో వైకాపా ఎంపీల ప్రశ్నలకు కేంద్రం సమాధానమిచ్చింది. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారో గడువు చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర జలశక్తి శాఖ కోరింది. ‘‘నిర్మాణంలో ప్రస్తుతానికి రూ.15,668 కోట్ల వరకే మా బాధ్యత. ఫిబ్రవరి 2022 వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.14,336 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.12,311 కోట్లు తిరిగి చెల్లించాం’’ అని కేంద్రం పేర్కొంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement