Sunday, April 28, 2024

CBI Inquiry: మ‌రోసారి సీబీఐ విచార‌ణ‌కు హాజ‌రైన అవినాష్‌

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించనున్నారు. ఈ కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా తెలంగాణ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పలు షరతులు విధించింది.

ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ విచారణకు హాజరుకావాలని అవినాష్ రెడ్డిని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి ఇవాళ‌ మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. అవినాష్ ముందస్తు బెయిల్ పొందిన తరువాత సీబీఐ విచారణకు హాజరుకావడం ఇది మూడోసారి. ఇక, ఈ కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డిని గతంలో కూడా పలుమార్లు సీబీఐ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కేసులో అవినాస్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వివేకా కూతురు సునీతా రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement