Saturday, May 4, 2024

AP: విదేశాలకు వెళ్లేందుకు జగన్‌, విజయసాయికి కోర్టు అనుమతి

ఫారిన్ టూర్ కు వెళ్లేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిలకు సీబీఐ కోర్టు అనుమతిని మంజూరు చేసింది. యూకే వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో జగన్‌ ఇటీవల పిటిషన్‌ దాఖలు చేశారు. సెప్టెంబర్ 2న లండన్‌లోని తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్‌ షరతులు సడలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం వాదనలు ముగించిన న్యాయస్థానం.. సీఎం విదేశీ పర్యటనకు అనుమతిస్తూ నేడు ఆదేశాలు జారీ చేసింది.

సెప్టెంబర్‌ 2 నుంచి 12 రోజులు లండన్‌ వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతించింది. అలాగే మరోవైపు యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం యూకే, యూఎస్, జర్మనీ, దుబాయ్, సింగపూర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వాదనలు ముగించిన కోర్టు.. ఆయన విదేశాలకు వెళ్లేందుకు అనుమతించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement