Sunday, May 12, 2024

Breaking: లేడీ సీఐపై కేసు న‌మోదు.. వార్తా క‌థ‌నాల‌తో సుమోటోగా తీసుకున్న మ‌హిళా క‌మిష‌న్‌

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి టౌన్​ సీఐ అంజుయాద‌వ్ తీరుపై ఏపీలో పెను దుమారం చెల‌రేగింది. ఓ మ‌హిళ‌ను అకార‌ణంగా కాలితో త‌న్నుతూ, పోలీసు జీపులోకి నెట్ట‌డం వీడియో ద్వారా చూసిన జ‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఆంధ్ర‌ప్ర‌భ ఇంట‌ర్నెట్ ఎడిష‌న్‌లో వీడియోతో స‌హా వార్తా క‌థ‌నం ప్ర‌చురితం అయ్యింది.

దీన్ని చూసిన మ‌హిళా క‌మిష‌న్‌, ఏపీ పోలీసులు, సీఎంవో అధికారులు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించారు. ఈ మేర‌కు యాక్షన్​ తీసుకుంటున్నట్టు రీట్వీట్ చేశారు. ఇక‌.. మ‌హిళా క‌మిష‌న్ మీడియాలో వచ్చిన వార్తా క‌థ‌నాల‌ను సుమోటాగా తీసుకుని మ‌హిళా సీఐ అంజుయాదవ్​పై కేసు న‌మోదు చేసిన‌ట్టు తెలిపింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement