Friday, May 3, 2024

FLASH: ఆర్ఐపై హత్యాయత్నం కేసు.. 9 మంది నిందితులు అరెస్ట్

కృష్ణా జిల్లా గుడివాడలో అర్బన్ ఆర్ఐ అరవింద్ పై మట్టి మాఫియా దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అరవింద్ ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసుకున్న పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో రాధాకృష్ణ, లక్ష్మణరావు ప్రధాన నిందితులుగా భావిస్తున్నారు. కాగా, అరెస్టయిన వారిలో ఓ బాల నేరస్తుడు కూడా ఉన్నాడు. 

అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకునే యత్నంలో ఆర్ఐ అరవింద్ సంఘటన స్థలానికి రాగా, రాధాకృష్ణ, లక్ష్మణరావు తదితరులు ఆయనను జేసీబీతో నెట్టివేసి, గొంతు నులుముతూ, ముఖంపై దాడి చేశారు. ఈ ఘటనలో అరవింద్ చొక్కా చిరిగిపోవడమే కాదు, మెడలో బంగారు చెయిన్ కూడా తెగిపోయింది. ఈ ఘటనపై ఆర్ఐ తహసీల్దారు శ్రీనివాసరావుకు సమాచారం అందించడంతో పలువురు వీఆర్వోలు అక్కడికి చేరుకున్నారు. అనంతరం, అరవింద్ తనపై జరిగిన దాడి పట్ల తాలూకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement