Monday, April 29, 2024

Flash: బ్రిడ్జ్ పై నుండి నదిలోకి దూసుకెళ్లిన కారు..

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట బైపాస్ రోడ్ లోని కాళంగి నది పైన ఉన్న బ్రిడ్జ్ పై నుండి నదిలోకి కారు బోల్తా కొట్టిన సంఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సూళ్లూరుపేట పట్టణానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి మన్నారుపోలూరుకు చెందిన షఫీ అనేవ్యక్తి వాటర్ సర్వీసు సెంటర్లో వాటర్ సర్వీసుకు ఇచ్చాడు. ఈ క్రమంలో సర్వీసు సెంటర్లో పనిచేసే ముగ్గురు యువకులు మద్యం సేవించడం కోసం గురువారం సూళ్లూరుపేటకు వచ్చి తిరిగి సర్వీసు సెంటర్ కు వెళ్తున్న క్రమంలో అతివేగంగా బ్రిడ్జ్ ను ఢీ కొట్టడంతో కారు నదిలోకి దూసుకు వెళ్లినట్లు తెలుస్తున్నది.

కారు ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో అందులో ఉన్న ముగ్గురు యువకులకు ఉన్నారు. అయితే, వారికి గాయాలు కాకపోవడంతో కారును వదిలి పరారైనట్లు తెలుస్తుంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement