Tuesday, April 30, 2024

Campaign – జనసేనాని భేరీ! అనకాపల్లిలో 4న శంఖారావం

అమ‌రావ‌తి – ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ యుద్ధ భేరీ మోగించనున్నారు. ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 4న అనకాపల్లిలో జరిగే భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ శంఖారావం పూరిస్తారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పార్టీలన్నీ ప్రచార రంగాన్ని సిద్ధం చేసుకున్నాయి. వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార వైసీపీ అన్ని సీట్లల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది. ఇక 175 స్థానాల్లో ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. అయితే, ఇంకా ఈ రెండు పార్టీల మధ్య సీట్ల లెక్క తేలలేదు. చెరో రెండు సీట్లను ప్రకటించుకున్నాయి. టీడీపీ పొత్తు ధర్మం పాటించలేదని పవన్ కళ్యాణ్ మండిపడుతూ రెండు సీట్లను ప్రకటించినా.. పొత్తును కొనసాగిస్తామని స్పష్టం చేశారు..

ప్రచార రంగంలోకి జనసేనాధిపతి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఫిబ్రవరి నాలుగో తేదిఅనకాపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్లాన్లు జరుగుతున్నాయి. ఇక ఆయన అనకాపల్లి నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ముందుగా ఆయ‌న ఆరోజు నూకాలమ్మ తల్లి ని దర్శించుకోనున్నారు. నూకాలమ్మ తల్లి దీవెనలతో ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అదే సభలో కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement