Monday, April 29, 2024

AP : బస్సు భీభత్సం… ముగ్గురు మృతి

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో): ఆసియాలోనే అతిపెద్ద విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాట్ఫామ్ పైకి పార్కింగ్ కోసం వస్తున్న ఆర్టీసీ బస్సు ప్లాట్ఫామ్ పైకి దూసుకురావడంతో ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుండీ గుంటూరు వెళ్లాల్సిన మెట్రో లక్సరీ బస్ ప్లాట్ ఫామ్ పైకి వస్తున్న సందర్భంలో బ్రేకులు ఫైల్ ప్రయాణికుల పైకి దూసుకు వెళ్ళింది.

బస్టాండ్ లోని ప్లాట్ఫారం నెంబర్ 12 పై బస్సు కోసం ప్లాట్ఫారంపై ఎదురుచూస్తున్న ప్రయాణికుల పైకి బస్సు దూసుకు వెళ్లడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారూ. వీరిలో ఒక చిన్నారి ఉన్నట్లు సమాచారం. ఇదే ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంలో బస్సు కింద ఉన్న ప్రయాణీకులను రక్షించేందుకు అధికారులు ప్రయత్నించి వారిని బయటికి తీసుకొచ్చారు. గాయపడిన వ్యక్తులని దగ్గరలోని ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ప్లాట్ఫారంపై హఠాత్తుగా జరిగిన పరిణామంతో దగ్గరలో ఉన్న ప్రయాణికులు భయోందాలను గురి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement