Sunday, May 5, 2024

ఏపీలో బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ కార్యకలాపాలను విస్తరించేందుకు బీఆర్‌ఎస్‌ మరో ముందడుగు వేసింది. గుంటూరులో బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. మంగళగిరి రోడ్డులోని ఏఎస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వద్ద ఐదంతస్థుల భవనంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కాన్ఫరెన్స్‌ హాళ్లు, నాయకులకు ప్రత్యేక చాంబర్లు ఏర్పాటు చేశారు.

ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీ గులాబీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కాగా 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే పార్టీ కార్యాలయాన్ని సిద్ధం చేశారు. ఇకపై పార్టీ కార్యక్రమాలు ఇక్కడి నుంచే జరగనున్నాయని ఏపీ బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు తోట చంద్రశేఖర్‌ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి ఏపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement