Sunday, April 28, 2024

Breaking: బద్వేల్ లో వైసీపీకి భారీ మెజార్టీతో విజ‌యం ఖ‌రారు.. వైసీపీ శ్రేణుల సంబ‌రాలు

కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. వైఎస్సార్‌సీపీ అభ్య‌ర్థి డాక్టర్‌ దాసరి సుధ విజ‌యం ఖ‌రారైంది. 12 రౌండ్లు ముగిసేసరికి వైసీపీకి మొత్తం 90,089 ఓట్లు, బీజేపీకి 21,621 ఓట్లు వ‌చ్చాయి. అలాగే, కాంగ్రెస్‌కు 6,205 ఓట్లు, నోటాకు 3,635 ఓట్లు వ‌చ్చిన‌ట్లు అధికారులు తెలిపారు.

ఆధిక్యంలో సుధా కొన‌సాగుతుండ‌డంతో ఆ పార్టీ శ్రేణులు సంతోషంగా ఉన్నారు. ఓట్ల లెక్కింపు తుది ద‌శ‌లో ఉంది. ఇప్ప‌టికే పూర్తి ఆధిక్యంలో సుధ ఉండ‌డంతో వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు సంబ‌రాలు మొద‌లు పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement