Sunday, April 28, 2024

Breaking : ఏపీలో కొత్త‌గా మ‌రో ఆరు మండ‌లాలు..

ఆరు జిల్లా కేంద్రాల‌ను రెండు మండ‌లాలుగా విడ‌దీస్తూ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది ఏపీ స‌ర్కార్. వీటిలో అనంతపురం, ఒంగోలు, నంద్యాల, చిత్తూరు, విజయనగరంలను అర్బన్, రూరల్ మండలాలుగా… మచిలీపట్నంను సౌత్, నార్త్ మండలాలుగా విభజిస్తున్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొంది. మండలాల విభజనపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని… నెలలోగా అభ్యంతరాలను జిల్లా కలెక్టర్ కు తెలియజేయాలని సూచించింది.దాంతో ఏపీలో కొత్తగా మరో 6 మండలాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఈమేరకు ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement