Friday, May 17, 2024

Breaking: యాక్సిడెంట్ లో చ‌నిపోయిన ఎంపీడీవో నర్మద.. చికిత్స పొందుతూ ఆమె భ‌ర్త కూడా మృతి

Andhr Pradesh: నెల్లూరు జిల్లా ఆదిశంక‌ర కాలేజీ స‌మీపంలో జాతీయ ర‌హ‌దారిపై ఈరోజు తెల్ల‌వారుజామున యాక్సిడెంట్ జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో సూళ్లూరుపేట ఎంపీడీవో న‌ర్మ‌ద చ‌నిపోయారు. ముందు వెళుతున్న లారీని కారు ఢీకొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. అదే కారులో న‌ర్మదతో పాటు వారి కుటుంబ స‌భ్యులున్నారు.

గూడూరు రూరల్ లోని ఆదిశంకర కాలేజ్ సమీపంలో జాతీయ రహదారిపై ముందు వెళుతున్న లారీని ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న సూళ్లురుపేట ఎంపీడీవో నర్మద చ‌నిపోయారు. కారులో ఎంపీడీవో భర్త, కొడుకు ఉన్నారు. వీరు నెల్లూరు నుండి సూళ్లూరుపేట వెళుతుండగా ఈ యాక్సిడెంట్ జ‌రిగింది. ఘటన స్థలానికి చేరుకున్న గూడూరు రూరల్ ఎస్సై బ్రహ్మనాయుడు, పోలీసు సిబ్బంది క్షతగాత్రులను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి చికిత్స అందించారు.

కాగా, మృతురాలు సూళ్లూరుపేట ఎంపీడీవో నర్మద భ‌ర్త‌.. అదే ప్రమాదంలో గాయ‌ప‌డ్డారు. ఇత‌ని పేరు సుధాక‌ర్ అని.. టీపీ గూడూరు పోలీస్ స్టేష‌న్‌లో కానిస్టేబుల్ గా ప‌నిచేస్తున్న‌ట్టు స‌మాచారం. అయితే నెల్లూరు నారాయణ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సుధాక‌ర్ కూడా చ‌నిపోయిన‌ట్టు ఆస్ప‌త్రి డాక్ట‌ర్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement