Saturday, May 18, 2024

AP | సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రేక్..!

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర చేపట్టారు. అయితే సీఎం జగన్ బస్సు యాత్రకు ఒక్కరోజు బ్రేక్ ప‌డింది. రేపు (ఆదివారం) ఈస్టర్ సందర్భంగా జగన్ ఈ వేడుకల్లో పాల్గొననున్న దృష్ట్యా బస్సుయాత్రకు ఒక్కరోజు గ్యాప్ ఇచ్చినట్లు వైసీపీ శనివారం ప్రకటించింది.

ఇడుపాయ నుంచి ప్రారంభమైన యాత్ర నంద్యాల జిల్లా నుంచి అనంతపురం చేరుకుంది. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో జగన్ మేమంతా శరత్ బస్సు యాత్ర కొనసాగుతోంది. ఈస్టర్ నేపథ్యంలో రేపు విరామం ప్రకటించిన జగన్.. సోమవారం అనంతపురం జిల్లా శివారు సంజీవపురం చేరుకుని బస్సు యాత్రను పునఃప్రారంభించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement