Sunday, April 28, 2024

శ్రీకాకుళంలో విషాదం… సముద్రంలో పడవ బోల్తా

శ్రీకాకుళం జిల్లాలోని గార మండలం బందరువానిపేట తీరంలో విషాదం చోటు చేసుకుంది. శనివారం వేకువజామున సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మత్స్యకారులు గల్లంతవగా ఒకరు మృతి చెందారు. పడవలో ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళ్లినట్లు తెలుస్తోంది. గల్లంతైన మిగిలిన ముగ్గురు మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కుటుంబసభ్యులు జాలర్ల కోసం ఆందోళన చెందుతున్నారు. 

ఈ వార్త కూడా చదవండిః 36 ఏళ్ల అమరరాజా ప్రయాణం.. వాట్ నెక్ట్స్?

Advertisement

తాజా వార్తలు

Advertisement