Saturday, May 4, 2024

BJP చంద్ర‌బాబు, నారా లోకేష్ ల‌పై సోము వీర్రాజు మండిపాటు ..

నంద్యాల – పాదయాత్రలో భాగంగా రాయలసీమను అభివృద్ధి చేస్తామని టిడిపి య‌వ‌నేత నారా లోకేష్ హామీలు ఎలా ఇస్తున్నారు? అని ప్రశ్నించారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. 14 సంవత్సరాల పాటు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటికీ.. రాయలసీమకు ఏమీ చెయ్యలేదని దుయ్యబట్టారు. మళ్లీ రాయలసీమను అభివృద్ధి చేస్తామంటే, ప్రజలు నమ్మరని తేల్చి చెప్పారు.

నంద్యాలలో బీజేపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అయిన తర్వాత సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోడ్లు వేసింది కేంద్రంలో ఉన్న తమ బీజేపీ ప్రభుత్వమేనని, రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేదని విమర్శించారు. ఏపీలో తాము అభివృద్ధి చేస్తే.. జగన్ సర్కార్ తమ స్టిక్కర్లు వేసుకుందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగా లేవని, ఎంపీ ఫ్యామిలీనీ కిడ్నాప్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. . వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని.. అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. చివరికి.. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో కూడా కుంభకోణాలకు పాల్పడుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement